తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1602 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,47,284 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1366 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 982 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,26,646 కి చేరింది. ప్రస్తుతం 19,272 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 91.65 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 295, మేడ్చల్ లో 137, రంగారెడ్డిలో 118, ఖమ్మంలో 79, నల్గొండలో 79, భద్రాద్రి కొత్తగూడెంలో 77, కరీంనగర్ లో 76, వరంగల్ అర్బన్ లో 49 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ