మే డే 2002ను పురస్కరించుకొని రాష్ట్రంలోని కార్మికులందరికీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేపు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులను ప్రదానం చేయనున్నదని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 3 సంవత్సరాలుగా జరుపుకోలేని మే డే ఉత్సవాలను ఈ సంవత్సరం అత్యంత వైభవంగా మరియు ద్విగుణీకృత ఉత్సాహంతో జరుపబోతున్నామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మే డే ఉత్సవాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయని, కావున కార్మికులు, యాజమాన్యాలు, ఇతర ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ