ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ బాధ్యతలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సీఎస్కే జట్టు కెప్టెన్సీని రవీంద్ర జడేజా తిరిగి ఎంఎస్ ధోనికే అందించాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం శనివారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది.
“రవీంద్ర జడేజా తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు సీఎస్కేకి నాయకత్వం వహించమని ఎంఎస్ ధోనిని అభ్యర్థించాడు. ఎంఎస్ ధోని జట్టు అవసరాల దృష్ట్యా, జడేజా తన ఆటపై దృష్టి పెట్టడానికి సీఎస్కేని నడిపించడానికి అంగీకరించాడు” అని ప్రకటించారు. మరోవైపు ఐపీఎల్ 2022లో సీఎస్కే జట్టు అంచనాలకు తగినట్టుగా రాణించలేదు. ఇప్పటివరకు రవీంద్ర జడేజా నాయకత్వంలో 8 మ్యాచులు ఆడిన సీఎస్కే జట్టు, రెండు విజయాలు సాధించగా, ఆరు మ్యాచుల్లో పరాజయం పాలయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ