మూడేళ్లలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల రైతుబంధు నగదు, 6 విడతల్లో 35,660.65 కోట్లు

Agriculture Minister Singireddy Niranjan Reddy, Funds for Rythu Bandhu Scheme, Mango News Telugu, Minister Singireddy Niranjan Reddy, Rythu Bandhu, Rythu Bandhu Distribution, Rythu Bandhu Funds Allocation, Rythu Bandhu Latest Update, Rythu Bandhu Money, Rythu Bandhu Money Distribution, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme and Funds Allocation, Rythu Bandhu Scheme Latest News, Telangana Minister Singireddy Niranjan Reddy, Telangana Rythu Bandhu Status

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద 2018 వానాకాలం నుండి ఇప్పటివరకు ఆరు విడతలలో 35,660.65 కోట్లు రైతుల ఖాతాలలోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదటి విడతలో చెక్కుల ద్వారా, ఆ తరువాత నేరుగా రైతు బ్యాంకుల ఖాతాలలోకి జమచేస్తునట్లు పేర్కొన్నారు. మొదటి రెండు విడతలలో ఎకరానికి రూ.4 వేల చొప్పున, మిగతా నాలుగు విడతలలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతులకు నగదు పంపిణీ చేశామన్నారు.

గత మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల నగదు బదిలీ:

“గత మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల నగదు బదిలీ చేశాం. ఈ యాసంగిలో 59.16 లక్షల మంది రైతులకు రూ.7351.74 కోట్లు ఖాతాలలో ఇప్పటికే జమ అయ్యాయి. ఈ ఏడాది వానాకాలం మరియు యాసంగి సీజన్ లకు కలిపి రైతుబంధు కింద రూ.14,640.44 కోట్లు పంపిణీ చేశాం. 2018-19 లో 50.25 లక్షల మంది రైతులకు రూ.10,488.19 కోట్లు, 2019-20 లో 51.61 లక్షల మంది రైతులకు రూ.10,532.02 కోట్లు, 2020 వానాకాలంలో 58.02 లక్షల మంది రైతులకు రూ.7288.70 కోట్లు రైతుబంధు కింద పంపిణీ చేసాం” అని మంత్రి వెల్లడించారు.

సీఎం కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శం:

“దళారీల బెడద, పార్టీల ఊసు, పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా, పట్టాదారు పాసుపుస్తకం కలిగి, బ్యాంకు ఖాతాలతో సరైన వివరాలు నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు సాయం జమ చేశాం. వ్యవసాయానికి వెన్నెముకగా నిలవాలని, అన్నం పెట్టే రైతు అగ్రస్థానంలో ఉండాలని ప్రపంంచలోనే ఏ దేశంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. కరోనా విపత్కర పరిస్థితులలోనూ అన్నదాతలకు రైతుబంధు సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్ ది. తెలంగాణ రైతాంగం తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు. వ్యవసాయం లాభసాటి చేసేందుకు రైతుబంధు, ఉచిత కరెంటు, వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైతుభీమా పథకాలతో కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శం. తెలంగాణ వ్యవసాయ విధానాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలి. కేంద్రం రైతులకు భరోసా కల్పించే చర్యలను వదిలేసి వ్యవసాయం కార్పోరేట్ల పరంచేసే చర్యలు సరికాదు. రైతుబంధు నిధులు పకడ్భందీగా రైతుల ఖాతాలకు చేరేందుకు నిరంతరం కృషిచేసిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్ఐసీ, ఆర్థిక, రెవిన్యూ ఉద్యోగులకు ధన్యవాదాలు” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =