నగరంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సంబంధిత అధికారులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 1 నుండి ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేవుళ్ళను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
“ఈ నెల 9వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ వద్ద అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన నిర్వహకులు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందొద్దు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రజలు, నిర్వహకులకు చూపేందుకే ఈ రోజు ట్యాంక్ బండ్ పై పర్యటించాం” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY