జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిపై కేసు నమోదయింది. నగరంలో హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ పీవీ, ఎన్టీఆర్ సమాధులు జోలికొస్తే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇరువురు నేతలపై సుమోటో కింద ఎస్సార్ నగర్ పోలీసుల కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ