తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ముందుగా పార్టీ కార్యాలయం నిర్మాణ ప్రాంగణమంతా మంత్రి కలియతిరిగి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్, వర్క్ ఏజెన్సీతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగానే, పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం పార్టీ ఆఫీస్ లో ఉపయోగించనున్న ఫర్నిచర్ సంబంధిత పనులను కూడా మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల పరిశీలన సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ముజీబుద్దిన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE