మంత్రి జగదీశ్ రెడ్డి మరియు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదవిని అడ్డుకుపెట్టుకుని మంత్రి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారనే విషయం ఇక్కడి ప్రజలకు అర్థమైందని, ఆయన మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే రాజీనామా చేసారని, అయితే ప్రజల కోసమే తన పదవిని త్యాగం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు.
ఆరు నెలల క్రితం తనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినట్లు నిన్న రాజగోపాల్ రెడ్డే స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందా? అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. మరోవైపు మూడేళ్ళుగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నానని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని మంత్రి వ్యాఖ్యానించారు. పెద్ద పార్టీని వదిలేసి ముగ్గురు సభ్యులున్న చిన్న పార్టీలో చేరితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY