సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను శనివారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు. అలాగే ఈ సందర్భంగా చేనేత కళతో అద్భుత ప్రయోగాలు చేస్తున్న విజయ్ కు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అభినందనలు తెలిపారు. యువ చేనేత కళాకారుడు విజయ్ తన ప్రతిభతో ఇప్పటికే అగ్గి పెట్టెలో పట్టే చీర, దబ్బనంలో అమిరే చీరలు సహా ఎన్నో ప్రయోగాలతో సత్తాచాటి ఈ కళలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY