కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కర్ణాటకలో కొనసాగుతోంది. అనంతరం భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగే భారత్ జోడో యాత్ర అక్టోబర్ 14న తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి తెలిపారు. శనివారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో భారత్ జోడో యాత్ర పోస్టర్లను మస్తాన్వలి మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషస్పందన లభిస్తుందని మస్తాన్వలి అన్నారు. ఈ యాత్ర చారిత్రాత్మక అవసరమని మరియు భారతదేశ పురోగతికి ఎంతో ముఖ్యమన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY