భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని గుండాల మండలంలో రూ.4.21 కోట్లతో నిర్మించిన గుండాల నుండి పస్రా వెళ్లే రహదారిపై గల మల్లన్న వాగుపై హై-లెవెల్ బ్రిడ్జి ను ప్రారంభించారు. గుండాల మండలం నర్సాపురం గ్రామంలో రూ.2.17 కోట్లతో మల్లన్న వాగు మీద నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించారు. అనంతరం గుండాలతో నిర్వహించిన సభలో రైతులు, అధికారులతో మంత్రులు మాట్లాడి పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు, చేయాల్సిన పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుండాల, కాచనపల్లి గ్రామాల్లో రైతు వేదికలను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ