తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బుధవారం మధ్యాహ్నం ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీతక్క, మల్లు రవి, గీతా రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ముందుగా బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా వెళ్లి అక్కడ చాదర్ సమర్పించారు. అక్కడి నుంచి నాయకులు, జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలుతో గాంధీ భవన్ చేరుకొని టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు నాయకులు ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ