దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ ప్రకటనతో పాటుగా జెండా, అజెండాను వైఎస్ షర్మిల రేపు ఆవిష్కరించనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది. అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, ఆహ్వానితులకు ఇప్పటికే పాస్ లు అందజేశారు.
ముందుగా వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి బుధవారం సాయంత్రం కడప జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. 4 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ కు చేరుకోని పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ప్రారంభిస్తారు. 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరో కొత్త పార్టీ రాబోతుండడం అందరిలో ఆసక్తి నెలకుంది. వైఎస్ షర్మిల పార్టీ రాష్ట్రంలో ఎలాంటి సంచలనాలను సృష్టించనుందో వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ