మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలందరికీ మేలని, అందుకే ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. అలాగే మర్రిగూడెం అభివృద్ధి నా బాధ్యత అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడకు వచ్చి ఒక సంవత్సరంలో మర్రిగూడను అభివృద్ధి చేసి చూపిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అవకాశవాద రాజకీయాలు చేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసమే ఉపఎన్నికలు తెచ్చారని, ఈ విషయం మునుగోడు ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. నల్గొండలో దశాబ్దాలుగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని, ఇప్పుడు నల్గొండకు ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలవడం లేదని, చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఎక్కడా లేవని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి పథకాల వల్ల లబ్ది కలుగుతోందని, ఈ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY