నేటి నుంచే బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, యాదాద్రి నుంచి ప్రారంభం

Telangana BJP Chief Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Started Today From Yadadri, BJP Chief Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Started Today From Yadadri, Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Started Today From Yadadri, Telangana BJP Chief 3rd Phase Praja Sangrama Yatra Started Today From Yadadri, 3rd Phase Praja Sangrama Yatra Started Today From Yadadri, 3rd Phase Praja Sangrama Yatra Started Today, 3rd Phase Praja Sangrama Yatra, Praja Sangrama Yatra 3rd Phase, Praja Sangrama Yatra, Telangana BJP Chief Bandi Sanjay Kumar, BJP Chief Bandi Sanjay Kumar, Telangana BJP Chief, Bandi Sanjay Kumar, Praja Sangrama Yatra 3rd Phase News, Praja Sangrama Yatra 3rd Phase Latest News, Praja Sangrama Yatra 3rd Phase Latest Updates, Praja Sangrama Yatra 3rd Phase Live Updates, Mango News, Mango News Telugu,

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి (ఆగస్టు 2, మంగళవారం) మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై ఆగస్టు 26 వరకు కొనసాగనుంది. యాదాద్రి నుంచి వరంగల్ భద్రకాళి దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 24 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఐదు జిల్లాల పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా వెళ్లనుండగా బండి సంజయ్ 328 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి నివాళులు అర్పించి, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరారు. నాగ పంచమి సందర్భంగా ఖైరతాబాద్ లోని ఏడుగుళ్ళ దేవాలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. అలాగే యాత్ర ప్రారంభానికి ముందు యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా యాదరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని వంగపల్లి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకాగా, పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర యాదగిరిపల్లి (సభ), గాంధీ విగ్రహం, యాదాద్రి టౌన్, పాత యాదగిరి గుట్ట రోడ్, గొల్ల గుడిశలు, గొల్లగూడెం, దాతర్‌పల్లి మీదుగా కొనసాగనుంది.

ముందుగా బండి సంజయ్ ఆగస్టు 28, 20211న తొలిదశ పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ఈ యాత్ర చేపడుతునట్లు తెలిపారు. అనంతరం అక్టోబరు 2, 2021న హుస్నాబాద్‌ పట్టణంలో భారీ బహిరంగ సభతో తొలిదశ పాదయాత్రను ముగించారు. ఇక రెండో విడత పాదయాత్రను ఏప్రిల్ 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నుంచి ప్రారంభించి మే 14న తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగనున్న బండి సంజయ్ పాదయాత్ర యొక్క మూడో విడత నేడు ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =