తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు (ఏప్రిల్ 14, బుధవారం) నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ ఉపఎన్నిక ప్రచార పర్వం రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా, ఓరోజు ముందుగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపనున్నారు.
సీఎం కేసీఆర్ బహిరంగసభకు టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల స్థలంలో జరిగే ఈ సభను మాస్కులు, శానిటైజర్ల ఏర్పాటు సహా అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున ఈ బహిరంగ సభకు రానున్నారు. ఇప్పటికే నోముల భగత్, పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సభలో సీఎం కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ స్థానంలో ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. మరోవైపు ముందుగా సీఎం కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ