తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జడ్చర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా జడ్చర్ల నియోజకవర్గంలోని కావేరమ్మ పేట గ్రామంలో త్రాగునీటి సరఫరా కోసం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను మరియు బిటి రోడ్డును ప్రారంభించారు. అలాగే జడ్చర్ల పట్టణంలోని నల్ల చెరువుపై నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ తో పాటుగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు చేరుకొని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, సమీకృత మార్కెట్, ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ