తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ పోటీచేస్తున్నారు. ఇప్పటికే నోముల భగత్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గపరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14, బుధవారం నాడు హాలియాలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ బహిరంగ సభకు ఏర్పాట్లలో టీఆర్ఎస్ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ స్థానంలో ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 15 న ముగియనుండగా, ఓరోజు ముందుగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. మరోవైపు ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ