ఏపీలో కరోనా : కొత్తగా 2331 పాజిటివ్ కేసులు, 853 రికవరీలు నమోదు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 31,812 కరోనా పరీక్షలు నిర్వహించగా 2331 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా గుంటూరులో జిల్లాలో 368, కృష్ణాలో 327, విశాఖపట్నంలో 298, చిత్తూరు జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,13,274 కు చేరుకుంది.

ఇక కరోనా వలన చిత్తూరులో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, అనంతపూర్, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7262 కి పెరిగింది. గత 24 గంటల్లో 853 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,92,736 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seventeen =