నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్ పక్రియ, భారీగా పోలింగ్

Nagarjunasagar By-election Polling Completed Peacefully, 2021 Nagarjuna Sagar, Mango News, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar Assembly By-election Polling Under Way, Nagarjuna Sagar Assembly Poll, Nagarjuna Sagar By Poll 2021, Nagarjuna Sagar By Poll News, Nagarjuna Sagar By Poll Updates, Nagarjuna Sagar By-elections, Nagarjuna Sagar Election, Nagarjuna Sagar Election News, Nagarjuna Sagar Election Polling, Nagarjuna Sagar Election Updates, Nagarjuna Sagar Elections

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 81.5% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది.

నాగార్జునసాగర్ పోరులో 41 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ తరపున సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది. ఇక మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =