దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితిపై శనివారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల రోజువారీగా భారీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమీక్ష సమావేశం ప్రాధానత్య సంతరించుకుంది. ఆసుపత్రుల్లో బెడ్స్ సహా ఇతర సౌకర్యాలు, రెమిడెసివర్ ఇంజెక్షన్స్ అందుబాటు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఆక్సిజన్ సరఫరా సహా ఇతర అంశాలపై రాష్ట్రాల నుండి వస్తున్న నివేదికలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ