తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి ఎన్నికల నిర్వహణకై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. హైదరాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలో మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ మిత్రపక్షం అయిన ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ ఎమ్మెల్సీ బరిలో ఉండే ఎంఐఎం పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
బీఆర్ఎస్ మద్దతుపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతిచ్చినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అందరిని కలుపుకుని వెళ్లే దార్శనికతతో కూడిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ, దేశ ప్రజలు ఆశీర్వదిస్తారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్ పేరును అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా త్వరలోనే పదవీకాలం పూర్తిచేసుకోనున్న ఎంఐఎం నేత సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ అందించిన విలువైన సేవలకు అసదుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అనుభవం కూడిన అతని సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
మరోవైపు మహబూబ్నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం 2023, మే 1తో పూర్తవనుంది. మహబూబ్నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023, మార్చి 29తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE