తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న అతని ఇంటికి వచ్చి దాడి చేసి,అపహరించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, మావోయిస్టుల బృందం నల్లూరి శ్రీనివాస రావును హత్య చేసి చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు కనుకొన్నారు. నల్లూరి మృతదేహాన్ని కనుగొన్న తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. శ్రీనివాసరావు ఇన్ పార్మర్ అవ్వడం వలనే చంపామని, చర్ల ఏరియా కమిటీ శారద పేరుతో మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రంలో తెలియజేసారు.
మావోయిస్టుల కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరించి పోలీసులకు అందజేస్తున్నాడని, మావోయిస్టు పార్టీ నిర్ములించడానికి ప్రయత్నిస్తున్నాడని, నల్లూరి ఒక సమాచారకర్త అని వారు నమ్ముతున్నందున ఈ హత్య చేసినట్లు మావోయిస్టు బృందం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీల నుండి అన్యాయంగా 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని, ప్రజలను, ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేయిస్తున్నాడని పేర్కొన్నారు. నల్లూరి శ్రీనివాస రావుని అపహరించిన తరువాత, అతని భార్య దుర్గ, స్థానిక ప్రజలు మానవతాదృక్పదంతో విడుదల చేయాలనీ మావోయిస్టులను కోరిన కూడ వాళ్ళు అంగీకరించలేదు. ఈ ఘటన తో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పోలీసులు అప్రమత్తమయ్యి, ఆ ప్రాంత ప్రజాపతినిధుల పర్యటన వివరాలు ముందుగా తెలియజేయాలని కోరారు.
[subscribe]
[youtube_video videoid=e0x4VJ_qBLY]