కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయిన వారికీ తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ-పాస్ లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నవారు https://tsp.koopid.ai/epass వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నమోదైన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం డిజిటల్ పాసులను జారీ చేస్తామని ఆయన తెలియజేశారు.
లాక్డౌన్ మూడో విడతలో సడలింపులు తర్వాత స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, ఇప్పటికే వేల సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు తెలంగాణ పోలీసు విభాగం పేర్కొంది. ఒకేసారిగా భారీ సంఖ్యలో దరఖాస్తుల నమోదు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సర్వర్స్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ప్రజలు సహకరించి కొంత సమయం తీసుకుని మళ్ళీ దరఖాస్తు నమోదుకు వెబ్ సైట్ ద్వారా సంప్రదించాలని కోరారు.
Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl
After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu