సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి లేదని, నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్ వద్ద స్టాఫ్నర్సు నిర్మల గురువారం నాడు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల ఆత్మహత్యాయత్నానికి నిరసనగా నిమ్స్లో నర్సులు ఈ రోజు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆందోళనను దిగారు. పదోన్నతుల కల్పించే విషయంలో మెడికల్ సూపరింటెండెంట్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతులలో అర్హులను పక్కనబెడుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలన్నారు. ప్రస్తుతం ఆర్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న స్టాఫ్నర్సు నిర్మలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కే.మనోహర్ ను కలుసుకుని తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా నర్సులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నర్సుల సమస్యలు పరిష్కారానికి మనోహర్ భరోసా ఇచ్చారు, స్టాఫ్నర్సు నిర్మల పదోన్నతి అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆమె విషయంలో కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
[subscribe]