యావత్ రైతాంగానికి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి కేటీఆర్

Minister KTR Extends Wishes to the Farmers of Nation on National Farmers Day, 2021 Kisan Diwas, 2021 National Farmers Day, Celebrating the birthday of Chaudhary Charan Singh, Chaudhary Charan Singh, Chaudhary Charan Singh Birth Anniversary, Farmers Day, Farmers Day 2021, Kisan Diwas, Kisan Diwas 2021, Mango News, Mango News Telugu, National Farmers Day, National Farmers Day 2021, National Farmers Day Celebrations, National Farmers Day News, National Farmers’ Day Celebrated on Chaudhary Charan Singh Birth Anniversary

జాతీయ రైతుల దినోత్స‌వం (డిసెంబర్ 23) సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం ఎలా ఉంది?, తెలంగాణ వచ్చిన తరువాత మారిన రైతుల పరిస్థితికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ ట్వీట్ కు జత చేశారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగంలో అద్వితీయ ప్రగతి సాధించింది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసింది. కానీ కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ మన రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంలో అసలు నిజాలు ఏమిటో తెలుసుకుందాం” అని సంబంధిత వివరాలను జత చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ ప్రకటించాలని, రైతన్నలను ఇబ్బందులకు గురిచేయవద్దు అని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్ర బాగుంటే దేశం బాగుంటుంది అనేదే మా విధానమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 17 =