ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో రౌడీ షీటర్ వికాస్ దూబే ను పట్టుకునే క్రమంలో జరిగిన దాడిలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వికాస్ దూబే పోలీసులకు దొరికాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో జూలై 9, గురువారం ఉదయం వికాస్ దూబే ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు వికాస్ దూబే ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా ఆయనకు సన్నిహితంగా ఉండే ముగ్గురు అనుచరులు పోలీస్ ఎన్కౌంటర్లో మరణించారు. అతని బాడీగార్డు అమర్ దూబే మంగళవారం ఎన్కౌంటర్లో చనిపోగా, మరో ఇద్దరు అనుచరులు ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా ఈ రోజు ఉదయం పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu