భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఆరంభమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగతున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ముందుగా ప్రధాని మోదీతో కలిసి నడ్డా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, నడ్డా, పీయూష్ గోయల్ ఆసీనులవగా.. అమిత్ షా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్, స్మృతీ ఇరానీ, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే తదితరులు ముందు వరుసలో ఆసీనులయ్యారు. తొలిరోజు ఈ కార్యక్రమానికి 348 మంది కీలక స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి డీకే అరుణ, వివేక్ తదితరులు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశాలకు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ