బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతల ఘన స్వాగతం

PM Modi Reached to Hyderabad to Participate in BJP National Executive Meeting, Modi Reached to Hyderabad to Participate in BJP National Executive Meeting, PM Narendra Modi Reached to Hyderabad to Participate in BJP National Executive Meeting, Narendra Modi Reached to Hyderabad to Participate in BJP National Executive Meeting, PM Modi Reached to Hyderabad, PM Modi to Participate in BJP National Executive Meeting, BJP National Executive Meeting, National Executive Meeting, BJP National Executive Meeting News, BJP National Executive Meeting Latest News, BJP National Executive Meeting Latest Updates, BJP National Executive Meeting Live Updates, Amit Shah Union Home Minister, Union Home Minister, JP Nadda National President of the BJP, BJP National Executive event, National Executive event, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ లోని హెఛ్ఐసీసీ వేదికగా రెండ్రోజుల పాటుగా జరగనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోదీ నోవాటల్ కన్వెషన్ సెంటర్ కు చేరుకున్నారు. హైదరాబాద్ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం” అని పేర్కొన్నారు.

ఇక ప్రధాని మోదీ మొదటి రోజు షెడ్యూల్ లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హెఛ్ఐసీసీలో జరిగే తొలిరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుండి రిజర్వ్ సమయంగా ప్రకటించారు. రెండో రోజు షెడ్యూల్ లో భాగంగా జూలై 3, ఆదివారం 10 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు హెచ్ఐసీసీ వద్ద హెలిపాడ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకొని, అనంతరం 6.30 గంటలకు రోడ్డుమార్గంలో పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటల నుండి రా.7.30 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రి 7.35 గంటలకు సభ దగ్గర నుండి బయలుదేరి, రాజ్ భవన్ కు చేరుకుని బస చేయనున్నారు.

ఇక మూడో రోజైన జూలై 4, సోమవారం నాడు ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 30 అడుగుల ఎత్తైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =