ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టిన ఎనిమిదవ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు తెలుగు మాట్లాడే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ దాదాపు 700 కి.మీ.ల దూరం ప్రయాణించే మొదటిది అని పేర్కొన్నారు.
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో మరియు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మరియు సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. దేశీయంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలు మరియు రైలు వినియోగదారులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE