ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 19వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు తెలిపారు. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈమేరకు రాష్ట్ర బీజేపీ కీలక నేత, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సమాచారమిచ్చినట్టు తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ లో ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలో వెల్లడిస్తామని పీఎంవో తెలినట్టు సమాచారం.
ముందుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేస్తూ, ఈనెల 19న తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ను ప్రారంభించడంతో పాటుగా రూ.7 వేల కోట్లకుపైగా విలువగల పలు ప్రాజెక్టులకు భూమిపూజ, మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. అలాగే పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసే బహిరంగసభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు. అయితే వివిధ షెడ్యూల్స్ లో మార్పుల కారణంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్టు తాజాగా సమాచారం ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE