దేశంలో ఇటీవల రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,49,394 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 4, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712 కు చేరుకుంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కరోనా వలన మరో 1,072 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,00,055కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 14 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 95.39 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు (14,35,569–3.42%) దాటింది. ఇక కొత్తగా 2,46,674 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య కూడా 4 కోట్లు (4,00,17,088) దాటింది. కరోనా రికవరీ రేటు 95.39 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే ఫిబ్రవరి 3, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 73,58,04,280 కు చేరుకుంది. ఫిబ్రవరి 3న 16,11,666 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ