పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిపారు. జాతీయ రాజకీయాల పరిస్థితులు, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సహా పలు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్, సీఎం భగవంత్ మాన్ చర్చించనున్నట్టు సమాచారం.
ముందుగా మంగళవారం ఉదయం నగరంలో పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం ప్రగతిభవన్ కు చేరుకొని సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పంజాబ్ రాష్ట్ర అధికారులు, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూదనా చారీ, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE