జూన్ 28న పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు, గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ హాజరు

CM KCR, Governor Dr. Tamilisai Soundararajan, Mango News, Narasimha Rao Centenary Celebrations, PV centenary celebrations to conclude on June 28, PV centennial to conclude on June 28, PV Narasimha Rao, PV Narasimha Rao Centenary, PV Narasimha Rao Centenary Celebrations, PV Narasimha Rao Centenary Celebrations Closing Ceremony, PV Narasimha Rao Centenary Celebrations Closing Ceremony will be held on June 28th, PV Narasimha Rao’s birth centenary celebrations, PV Narasimha Rao’s birth centenary celebrations to end

జూన్ 28వ తేదీన హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) లో జరిగే భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరవుతారని శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు తెలిపారు. గురువారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శతజయంతి వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =