మునుగోడు ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌

Munugode Bye-election Polling Percentage Reported till 5 PM is 77.55 77.55 Percent Polling Reported In Munugode By-poll, Telangana's Munugode Assembly bypoll, Munugode Assembly bypoll, Munugode assembly constituency, Telangana's Munugode Bypoll, Munugode By-poll Live Updates, Mango News, Mango News Telugu, Munugode By-polls, Munugode Bye-election, Munugode Bye-election Polling Live Updates, Munugode Bypoll Elections, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode Election Schedule Release, Telangna BJP Party, Telangna Congress Party, YSRTP Party,

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,855 మంది ఓట్లలో 5 గంటల వరకు 1,87,527 ఓట్లు పోలయినట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ ఉపఎన్నికలో చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం కూడా భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇవ్వనున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండలంలోని తన స్వగ్రామంమైన లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలంలోని ఇడికూడ లోని 173వ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణవెల్లంలో ఓటు ఉండడంతో ఇక్కడ ఓటువేసే అవకాశం లేకుండా పోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =