తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీలు విభాగంలో స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ, రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ప్రశంసనీయమైన విజయం సాధించిన నిఖత్ జరీన్ కు తెలంగాణ కాంగ్రెస్ తరపున రూ.5 లక్షలు నజరానా ప్రకటిస్తున్నాను. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అలాగే ఇంతకు ముందు పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాకు ఇచ్చినట్లే గానే నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున రివార్డ్ ఇవ్వాలని కోరుతున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు సోమవారం నాడు రేవంత్ రెడ్డిని నిఖత్ జరీన్ తండ్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ముందుగా స్వర్ణపతకం సాధించిన నిఖత్ జరీన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తో పాటుగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు. భారత మహిళా బాక్సర్లు మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరపున స్వర్ణం సాధించిన ఐదో బాక్సర్గా నిలవడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచి స్వర్ణం పతకం గెలిచిన తొలి బాక్సర్గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF