తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతులకు రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎనిమిదవ రోజైన జనవరి 5, గురువారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎనిమిదవ రోజు మొత్తం 1,69,709 మంది రైతుల ఖాతాల్లో రూ.296.85 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. 5 లక్షల 93 వేల 717.02 ఎకరాలకు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 54 లక్షల 70 వేల 637 మంది రైతుల ఖాతాలలో రూ.4327.93 కోట్లు రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి దారి దీపం సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వ్యవసాయ రంగమే ఈ దేశ భవిష్యత్, దానిని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. వ్యవసాయరంగంలోనే ఉపాధి ఉందని, అత్యధిక శాతం మంది ప్రజానీకానికి ఉపాధి కల్పించగలమని నమ్మి ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగం అభ్యున్నతి కోసం రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. దాని ఫలితమే వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తున్నదని చెప్పారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి ఇప్పుడు 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయి. వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్ అని నమ్మిన ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE