తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ కు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారని, ఆయన ప్రస్తుతం తన ఫామ్ హౌస్లో ఉన్నట్టు తెలిపారు. అలాగే వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ