ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సీపీ పార్టీ వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని పలు అనుబంధ శాఖలకు అధ్యక్షులను నియమించింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతలతోపాటు యువకులకు కూడా పార్టీ కొన్ని ముఖ్యమైన పదవులు అప్పగించింది. ఇక ఎన్నికల సమయంలో ప్రధానపాత్ర పోషించే సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయనను వైసీపీ సోషల్ మీడియా అండ్ పార్టీ మీడియా కోఆర్డినేటర్గా నియమించినట్లు పార్టీ ప్రకటించింది. కాగా గతేడాది సెప్టెంబర్లోనే సజ్జల భార్గవ్ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జిగా లేళ్ల అప్పిరెడ్డిని, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE