అంగరంగ వైభవంగా ముగిసిన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు, హైలైట్స్ ఇవే…

Samatha Kumbh-2023 Brahmotsavam: Highlights of Rituals and Events,Kumbh 2023,Kumbh 2024,2023 Kumbh Mela,Kumbham 2023,Kumbam Sathayam 2023,Next Kumbh Mela 2023,Samatha Kumbh,Samatha Kumbh 2023,Samatha Kumbh 2023 Latest News,Samatha Kumbh 2023 News And Updates,Bhagavad Gita Chanting All The 18 Chapters,Avadhoota Datta Peetham Bhagavad Gita,Bhagavad Gita Chanting Benefits,Bhagavad Gita Guinness World Record,Chanting Of Bhagavad Gita,Largest Simultaneous Hindu Text Recital,Mahatma Gandhi On Bhagavad Gita

ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సమతా కుంభ్-2023 అనేది సమతా మూర్తి/స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి వార్షికోత్సవం కాగా, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫిబ్రవరి 12వ తేదీ వరకు 11 రోజుల పాటుగా ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చుట్టూ ఉన్న 108 దివ్యదేశాధీశుల, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి వార్షికోత్సవం (బ్రహ్మోత్సవం) జరుపుకోవడం కోసం సమతా కుంభ్-2023ను నిర్వహించారు.

శ్రీ చిన జీయర్ స్వామీజీ మాట్లాడుతూ, సమతా కుంభ్ మన పంచభూతాలను శక్తివంతం చేయడానికి, మూలకాలను శుద్ధి చేయడానికి మరియు మనల్ని బలోపేతం చేయడానికి నిర్వహించబడిందని, మనమే కాదు, మన పర్యావరణాన్ని కూడా అని, బ్రహ్మోత్సవం లక్ష్యం అదేనని తెలిపారు. గత సంవత్సరం సమరోహం సందర్భంగా, సందర్శకులు మరియు వీఐపీల యొక్క విపరీతమైన రద్దీ కారణంగా అన్ని ఆచారాలను దగ్గరగా నుండి వీక్షించి, సంతృప్తిగా పాల్గొనడానికి భక్తులను అనుమతించ లేదు. కాబట్టి సమతా కుంభ్-2023 పూర్తిగా భక్తులపై కేంద్రీకృతమై ఉంది. ఇది సమత లేదా సమానత్వం యొక్క నిజమైన ఆలోచన అని చెప్పారు.

సమతా కుంభ్ లో దాదాపు అన్ని ప్రధాన కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికలు కూడా 216 అడుగుల భగవద్ రామానుజాచార్య/ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ముందు నిర్మించబడ్డాయి. శ్రీ చిన జీయర్ స్వామీజీ వేదికపై నుండి మరియు కొన్నిసార్లు యాగం ప్రాంతం నుండి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కుంభ్ యొక్క అన్ని రోజులలో అన్ని ఆచారాల యొక్క విశేషాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఓపిగ్గా, అందరికి అర్ధమయ్యేలా భక్తులతో పంచుకున్నారు.

బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఫిబ్రవరి 12, ఆదివారం ఉదయం 9 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్యసాకేత క్షేత్రంలో ఉత్సవాస్త స్నపనము నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంట నుండి ప్రత్యేక వేదికపై ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసనము, మహాపూర్ణావుతి, ధ్వజావారోహణం, కుంభప్రోక్షణ, తీర్థ, ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతిలో యజ్ఞం యొక్క హోమ కుండాలలో చివరి ఆహుతి చూసేందుకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే కుంభ తీర్థంతో కూడిన ప్రోక్షణను యజ్ఞ రక్షగా బంగారు రామానుజులకు అలాగే సమానత్వ విగ్రహానికి కూడా సమర్పించారు. అనంతరం భక్తులకు పవిత్ర జలాన్ని చల్లి, కుంభతీర్థం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ చిన్న జీయర్ స్వామీజీ స్వామివారికి సమర్పించే నైవేద్యాల గురించి కూడా భక్తులకు వివరించారు

ఇక అన్ని రోజుల్లో కూడా సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో భారీ భక్త జనసందోహం పాల్గొనడంతో ముచ్చింతల్ లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిశాయి. సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియగా, ఫిబ్రవరి 14, మంగళవారం ఉదయం 9 గంటలకు 108 దివ్యదేశాధీశుల ఉత్సవాస్త స్నపనము ఉంటుందని తెలిపారు. ఇక మంగళవారం మధ్యాహ్నం నుండి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రజలకు మూసివేయబడుతుందని మరియు ఫిబ్రవరి 16, గురువారం ఉదయం 11 గంటల నుండి తిరిగి తెరవబడుతుందని/పునర్దర్శనం ఉంటుందని తెలిపారు.

సమతా కుంభ్-2023 ఆచారాలు, ఈవెంట్‌ల హైలైట్స్:

  • 11 రోజులు: ఆచారాలు, పూజలు మరియు యాగం, మధ్యాహ్నం, సాయంత్రం పాల్గొన్న వారందరికీ రోజువారీ మహాప్రసాదం పంపిణీ.
  • అన్నిరోజులలో మరియు అన్ని కార్యక్రమాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ చినజీయర్ స్వామీజీ స్వామిజీ చేసిన ఉపన్యాసం భక్తులకు చరిత్ర ఎన్నడూ చూడని అనేక విశిష్ట కార్యక్రమాలలో పాల్గొన్న దివ్య అనుభవం కలిగించింది. దేవాలయం కేవలం భగవంతుడిని చూసే స్థలం మాత్రమే కాదని, అన్ని స్థాయిలలో అవగాహనను మెరుగుపరచడం ద్వారా జీవితాన్ని ఉత్తమంగా ఎలా నడిపించాలో తెలుసుకోవడానికి అని చెప్పారు.
  • వెనుక ఉన్న వారికి దగ్గరి నుండి చూసేందుకు ఈవెంట్‌లను భారీ స్క్రీన్‌లపై చూపించారు. వేడుక మొత్తం టీవీ మరియు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
  • రోజువారీ మరియు ప్రత్యేక ఆచారాలు/కార్యక్రమాలు.
  • స్థపతిలు, వాలంటీర్లు మరియు యజ్మాన్లందరినీ గౌరవించడం.
  • బాణాసంచా ప్రదర్శన.
  • ఆచారాలు: సులభంగా అర్థం చేసుకోవడానికి రెండు రకాలు: రోజువారీ (అన్ని రోజులకు సాధారణం) మరియు 11 రోజులకు ప్రత్యేక ఆచారాలు.
  • రోజువారీ ఆచారాలు (ఉదయం 5.45 నుండి రాత్రి 9 గంటల వరకు): సుప్రభాతం, అష్టాక్షరి మంత్రంతో ధ్యానం, ఆరాధన, సేవా కాలం, శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్టి, రోజువారీ పూర్ణాహుతి, బలిహరణ,
  • ప్రత్యేక ఆచారాలు (స్వామీజీ నిర్ణయించిన సమయాల ప్రకారం):
  • ఫిబ్రవరి 2న (1వ రోజు) బంగారు రామానుజ స్వామికి అభిషేకం, విష్ణు సహస్రనామస్థోత్ర సామూహిక పఠనం.
  • ఫిబ్రవరి 3న (2వ రోజు) దివ్యసకేతం నుండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు సాకేత రాముని ఊరేగింపు, యాగం ప్రారంభం.
  • ఫిబ్రవరి 4న (3వ రోజు) రామానుజ నూత్తందాది సామూహిక పారాయణ, ఎదురుకోలు (పెళ్లికి ముందు తయారీ) మరియు 18 గరుడవాహనాలపై 18 దివ్యదేశాధీశుల ఊరేగింపు.
  • ఫిబ్రవరి 5న (4వ రోజు) అన్ని 108 దివ్యదేశాల శాంతి కళ్యాణం (వివాహ ఆచారాలు).
  • ఫిబ్రవరి 6న (5వ రోజు) వసంతోత్సవం మరియు ఊరేగింపు.
  • ఫిబ్రవరి 7న (6వ రోజు) డోలోత్సవం లేదా ఊయల వేడుక, ఊరేగింపు.
  • ఫిబ్రవరి 8న (7వ రోజు) లక్ష్మీ నారాయణ పూజ, భగవద్గీత అవధానం మరియు తెప్పోత్సవం.
  • ఫిబ్రవరి 9న (8వ రోజు) బంగారు రామానుజ స్వామికి ఆచార్య వరివస్య, విష్ణు సహస్రనామస్థోత్ర సామూహిక పఠనం.
  • ఫిబ్రవరి 10న (9వ రోజు) సామూహిక ఉపనయనాలు మరియు సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు.
  • ఫిబ్రవరి 11న (10వ రోజు) రథోత్సవం, భగవద్గీత సామూహిక పఠనం.
  • ఫిబ్రవరి 12న (11వ రోజు) సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్యసాకేత క్షేత్రంలో ఉత్సవాస్త స్నపనము.
  • మధ్యాహ్నం 1.30 – సాయంత్రం 4.30 వరకు – సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, బాణాసంచా కాల్చడంతో సాయంత్రం ముగింపు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − four =