ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీసమేతంగా గవర్నర్ నివాసానికి చేరుకుని బిశ్వభూషణ్తో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ బిశ్వభూషణ్ హరిచందకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తాజాగా బిశ్వభూషణ్ను చత్తీస్ఘడ్ రాష్ట్రానికి బదిలీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని వీడుతున్న సందర్భంగా సీఎం జగన్ దంపతులు ఆయనను కలుసుకుని ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా దాదాపు మూడున్నరేళ్ళపాటు రాష్ట్రానికి బిశ్వభూషణ్ అందించిన సేవలను గుర్తుచేసుకున్న సీఎం జగన్ దంపతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా దేశంలోని మొత్తం 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. కాగా బిశ్వభూషణ్ స్థానంలో ఏపీ నూతన గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కేంద్రం నియమించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE