తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 25, సోమవారం నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు సీఎం కేసీఆర్ శాలువా కప్పి, ఆహ్వానం పలికారు. దాదాపుగా రెండు గంటల పాటుగా ప్రస్తుత జాతీయ రాజకీయాలు సహా ఇతర జాతీయ అంశాలపై వారి మధ్య చర్చ కొనసాగినట్టు తెలుస్తుంది.
ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పలుసార్లు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా పర్యటనలో కూడా జాతీయ రాజకీయాలపై వివిధ విపక్ష పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, ఆర్ధిక అంశాలుపై అధికారులతో అక్కడే వరుసగా సమీక్షలు నిర్వహించారు. సీఎం వెంట పలువురు రాష్ట్ర ఎంపీలు, మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY