భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు విశ్రాంతిలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఈ సిరీస్ కు బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా జట్టులో చేరారు. ఇక ఫిట్నెస్ సమస్య కారణంగా వన్డే సిరీస్కు దూరమైనా రవీంద్ర జడేజా మొదటి టీ20లో ఆడడం అనుమానమే. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ జట్టులో ఉన్న సూర్యకుమార్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్ ఈ టీ20 సిరీస్లో కూడా కొనసాగనున్నారు. ఇక ఈ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కుతుందా లేదా వేచిచూడాలి.
మరోవైపు వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్, రోవ్మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఆల్ రౌండర్స్ ఓడియన్ స్మిత్, జాసన్ హోల్డర్ రొమారియో షెపర్డ్ మరియు బౌలర్లు అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, అకేల్ హోసేన్ రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మూడు వన్డేల్లో కూడా పరాజయం పాలయ్యి డీలా పడ్డ వెస్టిండీస్ జట్టు, టీ20ల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తుంది. అలాగే టీ20 సిరీస్ లో కూడా మెరుగైన ప్రదర్శనతో పైచేయి సాధించాలని భారత్ సిద్ధమవుతోంది. టీ20ల్లో ఇరు జట్లు ప్రభావశీలంగా ఉండడంతో ఈ సిరీస్ హోరాహోరీగానే సాగే అవకాశముంది.
భారత్ (తుది జట్టు అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, దీపక్ హుడా/శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆర్ అశ్విన్/కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్.
వెస్టిండీస్ (తుది జట్టు అంచనా): నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, ఓడియన్ స్మిత్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్కాయ్, హేడెన్ వాల్ష్/అల్జారీ జోసెఫ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY