ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ముందుగా శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిశాట్ కు వెళ్లారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు.
మరోవైపు స్వల్ప అస్వస్థత కారణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారు. సీఎంకు జ్వరం తగ్గితే శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ వెంట పాల్గొనే అవకాశమునట్టు తెలుస్తుంది. ఇక్రిశాట్ వేడుకల అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు మూడుగంటల పాటుగా ముచ్చింతల్ లో ప్రధాని పర్యటించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ