అండర్-19 ప్రపంచకప్లో తుది అంకానికి రంగం సిద్ధమైంది. ఈరోజు (శనివారం) జరగబోయే ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. యష్ ధుల్ నేతృత్వంలోని యువకుల జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్ మ్యాచ్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఫైనల్స్కు వెళ్లిన భారత్ నాలుగు సార్లు అండర్-19 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఇదే ఊపులో ఫైనల్లో గెలిచి ఐదో టైటిల్ను ఖాతాలో వేసుకోవడానికి టీమిండియా రెడీ అయింది. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. బ్యాట్సమెన్ అండ్ బౌలర్స్ తో సమతూకంగా ఉంది. లీగ్ దశతో పాటు నాకౌట్ మ్యాచ్ లలో కూడా మంచి ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకున్నారు.
టీమిండియా కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ మంచి ఫామ్ లో ఉండటం భారత జట్టుకి అనుకూలించే విషయం. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి సూపర్ షో తో భారత్ ఫైనల్ కి చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్ లోకూడా వీరిద్దరూ రాణించాలని జట్టు భావిస్తోంది. కాగా, భారత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. హంగర్గేకర్, రవి కుమార్, వికీ ఓస్త్వాల్ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లలో సత్తా చాటారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ కు ముందు సీనియర్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అండర్-19 జట్టులోని యువ ఆటగాళ్లకు కొన్ని కీలక సూచనలివ్వటం తెలిసిందే. కాగా, ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి స్టార్స్పోర్ట్స్ ఛానల్ లో ప్రసారం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ