సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ, ఉత్తరాఖండ్, గౌహతి, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా (సీజే) ఐదుగురు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేశారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేశారు.
ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయ్యద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్ ఎస్ షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ నియామక సిఫార్సులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన అనంతరం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF