“నివర్“ తుఫాన్ బుధవారం రాత్రి 11:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2:30 గంటల మధ్యలో పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తీరం తాకే సమయంలో గంటకు 120-130 కి.మీ వేగంతో గాలులు వీచినట్టు ప్రకటించారు. దీంతో తమిళనాడులోని పలు జిల్లాలతో పాటుగా, పుదుచ్చేరి, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఏపీలో చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలపై నివర్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తిరుపతి పట్టణంలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
మరోవైపు అతి తీవ్ర తుపాన్ గా మొదలైన నివర్, తర్వాత కొంత తీవ్రత తగ్గి తీవ్ర తుపానుగా మారింది. తుఫాన్ తీవ్రతతో తమిళనాడు, పుదుచ్చేరిలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తమిళనాడులో ప్రభావిత జిల్లాల్లోని సుమారు లక్ష 50 వేల మంది ప్రజలను ఖాళీ చేయించి, పునరావాసకేంద్రాలకు తరలించారు. తమిళనాడులో గురువారం నాడు కూడా 16 జిల్లాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ప్రజలును వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ముఖ్యమంత్రి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ