తెలంగాణ లోని అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం పైనే ఉంది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మునుగోడు స్థానం నుంచి ఆయన ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించిన టీ-కాంగ్రెస్ ఈరోజు పార్టీ ముఖ్య నాయకులతో గాంధీభవన్లో సమావేశం అయింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో జరుగనున్న ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నియోజకవర్గ కమిటీ కన్వీనర్ మధు యాష్కీలతో పాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. అనంతరం టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్ల సమావేశం కూడా జరుగనుంది. కాగా మునుగోడులో పార్టీ తరపున ఎవరిని నిలబెట్టాలి, ఎన్నికల్లో అభ్యర్థి గెలుపుకి ఎలాంటి ప్రణాళిక అమలు చేయాలి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ