తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 18, ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం సోమవారం నుండి మళ్లీ యథాతథంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు కొరత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆదివారం రాత్రికి మరో 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రానికి ఇంతవరకు 30,21,720 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించగా, శనివారం 10 గంటల వరకు 29,52,274 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు వినియోగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 40,540 వ్యాక్సిన్ డోసులు ఆర్మీ దళాలకు అందజేసినట్టు తెలిపారు. అలాగే 0.57 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ