తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బక్కని నర్సింహులు పేరును ఖరారు చేసి ప్రకటించారు. జూలై 9న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి రాజీనామా చేసిన ఎల్.రమణ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష స్థానంలో ఖాళీ ఏర్పడడంతో, రాష్ట్ర నాయకులతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఎల్.రమణ స్థానంలో బక్కని నర్సింహులను నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ